దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లల్లో నెలకు కనీసం ఓ రోజు స్వచ్ఛందంగా ఖాధీ డ్రెస్ వేసుకొని రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE పాఠశాలల్ని కోరింది. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ భారత ప్రజల జీవనోపాధి, స్వావలంబన కోసం ఖాదీ ధరించాలని, ఖాదీని ప్రోత్సహించాలని మహాత్మా గాంధీ ఆ రోజుల్లో విజ్ఞప్తి చేసిన విషయాన్ని సీబీఎస్ఈ గుర్తు చేసింది. అయితే పాఠశాలల్లో ఖాదీ ధరించాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఉపాధ్యాయులకు, సిబ్బందికి మాత్రమే పరిమితం. ఇక మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఖాదీ దుస్తుల్ని ప్రోత్సహించేలా సీబీఎస్ఈ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది.