నరసారావుపేటలో నేడు కోడెల శివప్రసాద్ సంతాప సభలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలను చేస్తున్న వైసీపీని అందరూ నిలదీయాలని అన్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కోడెలకు మనం అర్పించే అసలైన నివాళి అని చెప్పారు. పావురాలగుట్ట మీద మాంసపు ముక్కలను ఏరుకుంటున్న సమయంలో... ఇంటి దగ్గర సంతకాలు చేయించుకున్నారంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు.
మరో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, పరిటాలను చంపిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసని, కోడెల మరణానికి కారణ