తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి, ఇర్రిపాక గ్రామల మధ్య నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. నిన్న ఏలేరు ప్రాజెక్టు అధికారులు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఈ బ్రిడ్జి సామర్ధ్యం తట్టుకోలేక విరిగి నీటిమట్టం అయింది. అయితే గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటప్పుడు ఉన్న అధికారులు మొక్కుబడిగా ఈ బ్రిడ్జి నిర్మించడంతో నాసిరకం పనులు చేస్తున్న అనేక రూపాయలు మామూళ్ల రూపంలో అధికారులకు అందినట్లు నిలువుటద్దంలా తెలుస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ కోల్పోవడంతో దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికందే సమయంలోనే బ్రిడ్జి కూలిపోవడంతో ఆ వరద నీరు పంట పొలాల్లోకి చేరుతుంది. చెరుతుందేమోనని రైతులు భయపడుతున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఇసుకను ఏలూరు ప్రాజెక్ట్ నుండి తీసి తమ స్వలాభం కొరకు వాడినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.