బెంగళూరులో పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం. ఏపీలో వాణిజ్య విస్తరణ దిశగా మంత్రితో టీసీఎస్ సంస్థ ప్రతినిధుల భేటీ. అనంతపురం, విశాఖపట్నం కేంద్రంగా భవిష్యత్ లో పారిశ్రామికాభివృద్ధి చేస్తామన్న మంత్రి మేకపాటి. సానుకూలతలను బట్టి మరిన్ని పెట్టుబడులు ఏపీలో పెట్టాలని ప్రతినిధులను కోరిన మంత్రి మేకపాటి. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు గల ఇండస్ట్రి, ఐ.టీ పాలసీ ప్రతిపాదనలపై పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ కూపర్స్) ప్రతినిధులతో చర్చ