ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. తమ హయాంలో గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి జరిగిందని, అదే, వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో ఎయిర్ పోర్టు సర్వీసులు ఆగిపోయాయని మండిపడ్డారు. విమానాశ్రయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, నిలిచిపోయిన సర్వీసులను పునరుద్ధరించాలని, ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.