ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘనత చంద్రబాబుదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 09:36 PM

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను మార్చే పోలవరం ప్రాజెక్టుకు ఆచరణ సాధ్యం చేసి చూపిన ఘనత చంద్రబాబుదేనని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ గుర్తులు మిగలకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌ భద్రత గాల్లో ఉంచిన ఘనత వైసీపీదేనని అన్నారు. గోదావరి జిల్లాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన ఘనత కూడా జగన్‌దేనన్నారు. కాటన్‌ దొర గోదావరి జిల్లా ప్రజలకు అన్నం పెడితే.. ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ సున్నం పెడుతున్నారని విమర్శించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com