మచిలీపట్నం ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న పి.డి.ఎస్ బియ్యాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ....ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్న ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.మిల్లర్లకు, ప్రభుత్వానికి నష్టం లేకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశం.జిల్లాలో 8 గోడౌన్లలో 85వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నాయి.నిల్వలు ఎలా చేస్తున్నారు, ఏప్రిల్, మే లలో పంపిణీ చేసే వరకు నిల్వ చేసే విధానంతో ఏమైనా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నదానిపై పరిశీలిస్తున్నాం.1000 శ్యాంపిళ్ళు ర్యాండమ్ గా తీసి పరీక్షలు నిర్వహిస్తాం. గోడౌన్లలో నిల్వలు ఉన్న బియ్యం లో బ్రోకెన్ రైస్, డిస్క్లరేషన్ ఎంత శాతం ఉన్నదో పరీక్షలు చేసి కమీషనర్ సివిల్ సప్లైస్ కు నివేదిస్తాం...