ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ బూత్ వద్ద విషాధకర సంఘటన

national |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 01:28 PM

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కటెకల్యాణ్ వికాస్ ఖండ్ పరిధిలోని పర్చేలీ పోలింగ్ బూత్ వద్ద ఒక విషాధకర సంఘటన చోటుచేసుకుంది.ప్రిసైడింగ్ అధికారి ఒకరు మృతి చెందారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రిసైడింగ్ అధికారి చంద్ర ప్రకాష్ ఠాకుర్ అనారోగ్యం పాలయ్యారు. వెంటనే పోలింగ్ అధికారులు చంద్ర ప్రకాష్ ఠాకుర్‌ను ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందారని తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com