ఇప్పటివరకు మన దేశంలో 10 అంకెలుగా మొబైల్ ఫోన్ నంబరుల ఇక ముందు 11 అంకెలుగా మర్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 9తో, మరికొన్ని 8, 7, 6లతో ప్రారంభమవుతున్న ఈ ఫోన్ నంబర్లలో ఒక అంకె అదనంగా కలవనుందని తెలుస్తోంది. 2050వ సంవత్సరం వరకు మన దేశంలో పెరగనున్న మొబైల్ నంబర్ల సంఖ్యకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకున్నట్టు చెపుతున్నారు. కాగా ప్రస్తుతం మనం వాడుతున్న 10 అంకెల సిరీస్లో 250 కోట్ల మందికి మాత్రమే సేవలందించవచ్చని, మరో అంకెను పెంచడం ద్వారా దేశ జనాభాకు తగ్గట్టు ఫోన్లని వినియోగంలోకి తీసుకురావచ్చని టెలికాం వర్గాలు చెపుతున్నాయి. మరి ఈ నిర్ణయం ఎంతవరకు అమలవుతుందో చూడాలి.