న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మజ్నూ కా తిలాలో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం ఈరోజు తనిఖీలు నిర్వహించింది. ఇద్దరు వ్యక్తుల వద్ద రూ. 30 కోట్ల విలువ చేసే హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పశ్చిమ బెంగాల్లోని మల్దాకు చెందిన రెహ్మన్, అబు బక్కర్ సిద్దిఖిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.