ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణాన్ని టీడీపీ రాజకీయం చేస్తుందని వైసీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… “మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము. మాకు శవ రాజకీయాలు తెలియదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోడెల మృతదేహం పక్కన మాట్లాడుతుంటే అసలు మనిషేన అనే అనుమానం కలుగుతోంది. కోడెల బ్రతికి ఉన్నప్పుడు హింసిస్తారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు. ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోను మానసిక వేదనకు గురిచేసి ఆయన శవం పక్కన రాజకీయాలు చేశారు. హరికృష్ణ, లాల్ జాన్ బాషా విషయంలో చంద్రబాబు అలానే చేశారు. బతికి ఉండగా కోడెలను మానసిక వేదనకు గురిచేశారు. కోడెల గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం చంద్రబాబు పరామర్శించలేదు. శవ రాజకీయాలతో ప్రజల్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వర్ల రామయ్య కోడెలపై తీవ్ర విమర్శలు చేశారు. కోడెల వలన పార్టీ భ్రష్టు పట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఫర్నిచర్ దొంగలించడం తప్పని వర్ల రామయ్య మాట్లాడారు. కోడెల ఆత్మహత్య పై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరు తాడుతో అంటే మరొకరు లుంగితో అని, మందు వికటించని ఇంకొకరు గుండెపోటు అని మాట్లాడుతున్నారు. కోడెల ఆత్మహత్యకు వైసీపీకి ఏం సంబంధం. కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నాయకులే. వైసీపీ నాయకులను నరికి చంపిన ఘనత టీడీపీది. శవ యాత్రలు శవ రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం. వైఎస్ రాజారెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డిని చంపిన హంతకులను మీ ఇంట్లో పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది. కోడెల.. కొడుకు, కుమార్తె వలన చనిపోయారని వర్ల రామయ్య స్వయంగా తెలిపారు. చలో ఆత్మకూరు చేపట్టినప్పుడు కోడెలను ఎందుకు చంద్రబాబు పిలవలేదు. పార్టీ మీటింగ్ లకు కోడెలను చంద్రబాబు ఆహ్వానించలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా కోడెల క్యారెక్టర్ ను కించపరిచింది చంద్రబాబు కాదా. చంద్రబాబు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించడానికి ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోంది. అచ్చెన్నాయుడు ఉద్యోగులను యుజిలేస్ ఫెల్లో అంటే కేస్ పెట్టారా. టీడీపీ నేతలు దళితులను కులం పేరుతో తిడితే కేస్ పెట్టారా. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు. కోడెల చనిపోయిన తరువాత ఐదు ఆరు గంటలకు వరకు చంద్రబాబు మాట్లాడలేదు. చంద్రబాబు మానసిక క్షోభపై కోడెల ఏమైనా లెటర్ రాశారా అని పదే పదే అడిగేవారు. కోడెల ఎలాంటి లెటర్ రాయలేదని తెలిసిన తరువాత చంద్రబాబు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. కోడెలను చంద్రబాబు మానసికంగా వేధించడం వలనే చనిపోయారు.” అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.