అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యంకు సీఎం జగన్ ఆదేశించారు. నరసరావుపేటలో రేపు ఉదయం 10 గంటలకు కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.