ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2019, 01:09 PM

తిరుమల: తిరుమలకి వెళ్లే  మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపులను, మరుగుదొడ్లను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆకస్మిత తనిఖీలు చేశారు. ఇందులో బాగంగా అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ మరుగుదొడ్ల విషయంలో పరిశుభ్రంగా ఉంచాలని ,ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మరుగుదొడ్లు లోపల బయట బ్లీచింగ్ వేయాలని అధికారులకు ఆదేశించారు. తిరుమలకు వెళ్లే భక్తులతో మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చున్నారు. అక్కడ ఉన్నటువంటి వర్తకులతో మాట్లాడుతూ ఆహార పదార్ధాలన్ని పరిశుభ్రంగా, ఎంఆర్పీ ధరలకే అమ్మాలని ఆదేశించారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com