ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. విశ్వహిందూ పరిషత్తు జాతీయ మాజీ కోశాధికారి, గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షులు జి.రాఘవరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ రవిపఠాన్శెట్టి, జిల్లా ఎస్పీ ఫకీరప్ప, బీజేపీ, విశ్వహిందూ పరిషత్తు, భజరంగదళ్ నాయకులు హాజరై రామభట్ల ఆలయం వద్ద వినాయక విగ్రహానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పద్దె సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విగ్రహాలను తీసుకొని దేవనగర్ కేసీ కెనాల్ వినాయక్ ఘాట్కు బయల్దేరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.