అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్ మీరా కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదముద్ర వేశారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ వాయిస్ను మరింత బలంగా వినిపించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. షర్మిష్ట ప్రణబ్ ముఖర్జీ కుమార్తె కాగా, అన్షుల్ లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాగా.. ముందుగా ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న షర్మిష్ట.. ఆ తర్వాత ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజాగా తనను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన శర్మిష్ట.. అన్షుల్కు అభినందనలు తెలియజేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పలువురు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులు తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. లోక్సభ ఫలితాలు వెలువడిన తరువాత.. నెల రోజుల పాటు తమ పార్టీ నుంచి టీవీ డిబేట్లకు ఎవరినీ పంపడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో పలు కీలక నియామకాలు చేస్తుతున్నారు. హర్యానా కాంగ్రెస్కు ఇటీవలే కొత్త సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జాను నియమించారు.