టీమిండియా కోచ్ గా మరోసారి ఎంపికైన రవిశాస్త్రి కి 20 శాతం జీతం పెంచారని సమాచారం. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ రూ. 8 కోట్లు జీతంగా చెల్లించేది. అయితే, వరల్డ్ కప్ తో శాస్త్రి కాంట్రాక్ట్ ముగిసినా.. కరీబియన్ టూర్ వరకు పొడిగించారు. ఆ తర్వాత కోచ్ కోసం ప్రకటన విడుదల చేయగా.. కపిల్దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రినే ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడి జీతం 20 శాతం పెంచారట. అంటే శాస్త్రి ఏడాదికి రూ. 9.5 నుంచి 10 కోట్లు అందుకోనున్నాడు. సహాయ సిబ్బంది వేతనాలను కూడా భారీగా పెంచారని తెలిసింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్కు రూ. 3.5 కోట్లు చొప్పున చెల్లించనున్నారట. బ్యాటింగ్ కోచ్గా ఎంపికైన విక్రమ్ రాథోడ్కు రూ. 2.5 నుంచి 3 కోట్లు దక్కనున్నాయి. కోచ్లకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.కాస్త ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.