నెల్లూరు:బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన నీటిపారుదల శాఖా మంత్రి పి. అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా, అన్ని శాఖల అధికారులతో సమిష్టిగా పనులు చేస్తూ, రాజకీయాలకు తావులేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేశాం. మంత్రి అనిల్ కుమార్.స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్. బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో రాజకీయ ఫ్లెక్సీ కట్టి ఉంటే స్వయంగా రాజకీయ ఫ్లెక్సీని తొలగించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.రొట్టెలపండుగ పూర్తి అయ్యే వరకు బారాషాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి