భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 విక్రమ్ ల్యాండర్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనం దాదాపుగా చంద్రుడిని చేరుకున్నామన్నారు. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందంటూ పేర్కొన్నారు. భారత ప్రజానీకం మొత్తం ఇస్రో వెంట ఉందన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ చిన్న ఎదురుదెబ్బను అధిగమించి.. భవిష్యత్తులో విజయాలుగా మలుచుకొని ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.