విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలోని పరిశోధక విద్యార్థినికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఆర్ . కరుణాదేవి "ఎ స్టడీ ఆన్ రిమూవల్ ఆఫ్ డైస్ ఫ్రమ్ అక్వియాన్ ఎన్విరాన్మెంట్ "అను అంశం పై డాక్టర్ వై . విజయ ,అసిస్టెంట్ ప్రొపెసర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్యర్యంలో పరిశోధనా గ్రంథం సమర్పించినందుకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కరుణాదేవి పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. కరుణాదేవికి డాక్టరేట్ రావటం పట్ల వి . యస్ .యు కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు మరియు పరిశోధనా విద్యార్థులు అభినందనలు తెలియచేశారు.