విజయవాడ, సూర్య బ్యూరో : సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వాప్తంగా జరు గుతున్న ప్రజా చైతన్యయాత్ర కృష్ణా జిల్లా, పెనమలూరులో పర్యటించిన సందర్భంగా స్థా్ధనిక దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నామని ఉప ముఖ్య మంత్రి, రెవిన్యూ శాఖా మంత్రి కె.ఇ. కృష్ణ మూర్తికి ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు ఓ ప్రకటనను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో 1974వ సంవత్సరం నుండి ఆర్.యస్.నెం:79/2లో చెరువు పోరంబోకు భూమిలో 52 మంది దళితులు కుటుంబానికి 020 సెంట్ల చొప్పున లీజుకు తీసుకొని సాగు చేసు కుంటున్నారు. 1979, 1985 సంవత్సరాలలో లీజును పొడిగించారు. ఆ భూమికి శాశ్వత పట్టాలు మంజూరు చేయవలసిం దిగా హైకోర్టు వారిని దళితులు అభ్యర్థి్ధంచగా, గతంలో మాదిరిగానే లీజులు పొడిగించమని వుత్తర్వులు జారీ చేసారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు కోరు తూ పెనమలూరు తహసీ ల్దార్కు స్ధానిక దళితులు పిటీషన్ పెట్టినప్పటికీ, లీజు పొడిగించబోమని తహ సీల్దార్ ఖరాఖండిగా సమాధానం చెప్పడం జరిగింది. గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి సైతం ఆయా భూములు అన్యా క్రాంతమయ్యేందుకు సహకరిస్తూ, దళితులకు వ్యతిరేకంగా పోలీసుల సహ కారంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కావున తక్షణమే కృష్ణాజిల్లా పెనమలూరులో దళితుల భూ సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని, హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేసేందుకు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు.