ఎపి రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం బడ్జెట్ను తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) కుదించింది. ముందుగా రాజధానిలో 130 కోట్ల రూపాయిలతో తిరుమల తరహాలో ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. వెంకటాయపాలెంలో 25 ఎకరాల్లో ఆలయం నిర్మించాలని టిటిడి తలపెట్టింది. అయితే ప్రస్తుతం దానిని మార్చింది. ఆలయం నిర్మాణానికి బడ్జెట్ణు 130 కోట్ల రూపాయిలనుంచి 30 కోట్లకు కుదించాలని నిర్ణయించింది. 30 కోట్ల రూపాయిలతో ఆనంద నిలయం, 100 కోట్ల రూపాయిలతో ఇతర నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్కు స్వస్తి పలికింది. అమరావతిలో అన్ని నిర్మాణాలు అవసరం లేదని టిటిడి పెద్దలు పేర్కొన్నారు.