క్షణం ఆలస్యమైనా ఆ యువతి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయేది. ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేది. అడుగు ముందుకు వేయడమే ఆలస్యం. జరగరాని ఘోరం జరిగిపోయేది. కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చాకచక్యంగా ఆ యువతి ప్రాణాలు కాపాడారు. నల్గొండ జిల్లా, చిలకూరు ప్రాంతానికి చెందిన బానోతు అనసూయ.. ఆమె గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు విశాఖ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత శివ ఇక్కడ ఆదిత్యకాలేజీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే కొద్ది కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో భర్తను కలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లుగా సమాచారం. భర్త శివ ఇక్కడ ఉన్నది లేనిది యాజమాన్యం స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె మనస్తాపం చెంది.. భవనం పైనుంచి దూకడానికి సిద్ధపడింది. ఇది గమనించిన సెక్యూరిటి హెడ్ రాంబాబు ఆమెను మాటల్లోకి దించి కాపాడారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఊపిరి తీసకుంది. పూర్తి వివరాలు అందవలసి ఉంది.