భారత్ నుంచి పాకిస్థాన్లోకి ప్రవేశించే ఇండస్ నది జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా కాకుండా.. ఆ నదికి చెందిన ఎక్కువ శాతం నీరు పాకిస్థాన్లోకి ప్రవేశిస్తుందని, అయితే ఆ నీటిని మన రైతులు, పరిశ్రమల కోసం ఎలా తరలించాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇండస్ నదికి సంబంధించి హైడ్రోలాజికల్, టెక్నో ఫీజిబులిటీ స్టడీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.