ఏపి సిఎం జగన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఓ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి, సభను ప్రారంభించాలని నిర్వాహకులు కోరిన వేళ నిరాకరించారట. జ్యోతిని వెలిగించేందుకు నిరాసక్తతను చూపారట. ఈ విషయాన్ని టిడిపి నుండి బిజెపికిలోకి ఫిరాయించిన సీఎం రమేశ్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది. అని ఆయన కామెంట్ పెట్టారు.