గత ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ నినాదంతో విజయం సాధించిన ట్రంప్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... ప్రజల నోట్లో నానుతూనే ఉంటారు. తాజాగా ఎగైన్ నినాదం అందుకున్న అయన మాడా మరు అమెరికా అధ్యక్ష స్తానం పై కన్నేసి. ఓట్ల కోసం దెస ప్రజలనే బ్లాక్ మెయిలింగ్ చేయటం అప్పుడే ఆరంభించేసాడాయన. . అమెరికాకు తాను తప్ప వేదిక్కు లేదని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనకే ఓటేసి గెలిపించాలని, లేకపోతే మీకే నష్టమంటూ అమెరికన్లను ఇప్పటి నుంచే బెదిరింపులకు దిగుతుండటంతో ప్రత్యర్ధులు భగ్గుమంటున్నారు. .
ఇప్పటికే అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్న నేపథ్యంలో ముంచుకొచ్చిన ఆర్థిక మాద్యం మరింత ముదిరి ప్రజలంతా రోడ్డున పడటమే కాదు. అమెరికా మరిన్ని అప్పుల్లో మునిగిపోవటం ఖాయమంటూ సామజిక మీడియా లోఆ ట్రంప్ చేస్తున్న కామెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు.
సహజంగానే వ్యాపార వేత్త ఐన ట్రంప్... వాణిజ్యపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. ఆర్ధిక పరమైన నిర్ణయాలలో చా లా కఠినంగా వ్యవహరించే వ్యక్తి. ఈ కారణంగానే చైనా లాంటి దేశాలు... ఆమెరికాకు దూరమవుతున్నాయి. అయినా వెనక్కి తగ్గని ట్రంప్ అమెరికా వాణిజ్యం బాగా నెమ్మదించిందించినట్టు ఆర్ధిక నిపుణులు హెచ్చిరిక లని కాస్త పక్కకి నెత్తినట్టే ఉందని అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలోనే బలమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే... అమెరికాకు మాంద్యం కష్టాలు తప్పవని, అందుకే తననే మళ్లి గెలిపించాలని ట్రంప్ హెచ్చరిస్తున్నారన్నది వారి వాదన. మరి జనం ఏం చేస్తారో చూడాలి.