కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం ఉంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని, పరిస్థితులు మారాయి కాబట్టి సమీక్ష తప్పనిసరి చేయాలని ట్రాయ్ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 16లోగా ధరలు తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు చెప్పాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ గడువు విధించింది.