ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 02:55 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఈ నెల 24నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో దుకాణాలు రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిటైల్‌ దుకాణాల నిర్వహణను ఆ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com