తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రిని అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.