ఇప్పటి దాకా పోలవరం హైడల్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, పోలవరం సాగునీటి ప్రాజెక్టు కేంద్ర పరిధిలో ఉండగా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అయితే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ పనులు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు కలిపి ఒకే టెండర్గా పిలవాలని నిర్ణయం తీసుకుంది. నవయుగ కంపెనీ చేస్తున్న ఈ పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలవరం జలవిద్యుత్(హైడల్) కేంద్రం నిర్మాణ టెండర్ వ్యవహారం కాస్త కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది .
కాగా గతంలోనూ ఇదే ఆలోచన నాని
గత టీడీపీ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి విన్నవిస్తే ససేమిరా అనటం తో . ఆయన సూచనతో కొత్తగా టెండర్లు పిలవకుండానే నవయుగ కంపెనీని తెచ్చి పనులు చేయించైనా విషయం విదితమే. ఐతే పన్నుల్లో అక్రమాలు జరిగాయని, నవయుగాని తప్పుకోవాలని నోటీసులు పంపిన రాష్ట్రం మల్లి . హెడ్ వర్క్స్ పనులు, హైడల్ ప్రాజెక్టు పనులు కలిపి కొత్తగా టెండర్ పిలవాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం కావాల్సి ఉంటుంది . మరి ఇప్పటికే పోలవరం టెండర్ల రద్దునే కేంద్ర మంత్రులు తప్పు పడుతున్న నేపథ్యంలో మోడీ సర్కారు ఈ రీ టెండర్ కి అంగీకరిస్తుందా? అన్న అనుమానాలు అధికార వర్గాలలోనే వినిపిస్తున్న మాట .