శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్) సైనికుల మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం పాక్కు ఆఫర్ ఇచ్చింది. పాకిస్థాన్ సైనికులు తెల్ల జెండాలతో వచ్చి ఆ మృతదేహాలను తీసుకెళ్లవచ్చని భారత సైన్యం వెల్లడించింది. అయితే పాక్ ఈ ఆఫర్పై ఇంకా స్పందించలేదు. కాగా జూలై 31వ తేదీన అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కొందరు వ్యక్తులు భారత్లోకి చొరబడేందుకు యత్నించగా వారిలో దాదాపుగా 5 నుంచి 7 మందిని భారత సైనికులు మట్టుబెట్టారు. ఈ క్రమంలో చనిపోయిన వారు పాక్కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు అయి ఉంటారని భావిస్తున్నారు. ఇక ఆ మృతదేహాలను తీసుకెళ్లేందుకే పాక్ సైనికులకు తెల్ల జెండాలతో రావాలని భారత్ సూచించింది.