వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ప్రజల ముంగిట పాలన ఉండాలనే వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక్కో వార్డు సచివాలయానికి 10మంది కార్యదర్శులు ఉంటారని, 10 మందిలో ఒకరిని పరిపాలన కార్యదర్శిగా నియమిస్తామని ఆయన తెలిపారు. అక్టోబర్ 2న వార్డు సచివాలయాలు ప్రారంభిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.