తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,917 మంది భక్తులు దర్శించుకున్నారు.