వచ్చే నెల ఏడో తేదీన హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ ఓబీసీ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర బీసీసంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు 60 శాతం కేటాయించడం అభినందనీయమన్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలు చేయాలని జగన్ను కోరామన్నారు.