ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యమంలా నీటి సంరక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2017, 01:03 AM

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి  : ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రానున్న 90 రోజు లకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ ఉద్యమం చేపట్టాలని ఇందుకోసం చెరువులు, చెక్‌ డ్యాంలు, పంటకుంటలను పటిష్ట పరచాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికల్లా 90 రోజుల ప్రణాళికను విజయవంతం చేసి చూపి ంచాలన్నారు. నీటి సంరక్షణ ఉద్యమంపై బుధవారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 20లోగా నీటి సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం, ఇందుకోసం 90 రోజుల కార్య ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో నీటి సమస్య అనేదే తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు  ఇప్పటివరకు పూర్తయిన 3.25 లక్షల పంటకుంటలను ఘనంగా ప్రారంభిం చాలని నిర్ణయించారు. ఈ 90 రోజుల్లోగా పంటకుంటల సంఖ్య 5 లక్షలకు చేరాలని లక్ష్యం పెట్టుకున్నారు. నరేగా నిధులతో చిన్నతరహా చెక్‌ డ్యాంల నిర్మాణం, చిన్న-మధ్యతరహా చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు జరపాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ నిధులతో మధ్యతరహా, భారీ చెక్‌ డ్యాంల నిర్మాణం, వంద ఎకరాలకు మించిన చెరువుల నిర్వహణతోపాటు  నీటి సంర క్షణ ఉద్యమంలో భాగస్వాములుగా ఇంజినీరింగ్‌ విద్యార్ధులు ఉండాలని నిర్ణయించారు. రెయిన్‌ గన్స్‌ నిర్వహణకు సర్వీస్‌ ప్రొవైడర్‌ను నియమించాలని ఆదేశించారు.


మిర్చి రైతులు నష్టపోకుండా సాయం


కనీస ధర లేక నష్ట పోతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రభుత్వ సాయంగా క్వింటాల్‌ మిర్చికి ఎంత ధర ఇవ్వాలి, ఇందుకు సంబంధించి విధివిధానాలపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మిర్చి రైతుల ప్రయోజనాల కాపాడేందుకు కేంద్ర సాయంతో సంబంధం లేకుండా యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చర్చల అనంతరం కొనుగోలు ధరపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, నారా లోకేష్‌, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com