ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ని ఒక్కసారిగా తెలంగాణకు పరిమితం చేయటం, ఇప్పుడు దాదాపు ఆయనని ఆ పదవి నుంచి మార్చేందుకు కేంద్రం సిద్దపడటం వెనుక బీజేపీ శాఖ అధ్యక్షుడు డా కే.లక్ష్మణ్ హస్తం ఉందా? అంటే అవునంటున్నాయి బిజెపి వర్గాలు. ఇంటెలీజెన్స్ మాజీ బాస్ గా ఉన్న అనుభవం నరసింహన్ కు బాగా కలిసొచ్చింది. అదే ఆయనను సుదీర్ఘకాలం గవర్నర్ గా కొనసాగేలా చేసింది. ఏకంగా ఐదుగురు సిఎంలతో ప్రమాణం చేయించిన ఘనతా చిక్కింది. మన్మోహన్ కాలంలో నియమితులైన గవర్నర్లంతా ఇంటి బాట పట్టినా తనదైన విధేయతతో మరో టర్మ్ పొడిగింపు దక్కించుకున్న ఏకైక వ్యక్తి నరసింహన్ అనటంలో సందేహం లేదు.
అయితే గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉండాలంటూ పలువురు ప్రముఖులు ఇప్పటికే పలుమార్లు వినతలు చేస్తున్నా స్పందించని కేంద్రం ఇటీవల నరసింహన్ తీరుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు డా. లక్ష్మణ్ ‘బ్రీఫింగ్’ ఇవ్వడం వల్లే ఏపి నుంచిదూరం చేయాలని భావించినట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అలా డిమాండ్ చేశారో లేదో... బీజేపీ అధినాయకత్వం వెంటనే స్పందించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలని నిర్ణయించిందంటే లక్ష్మణ్ మాటకు మోడీ ఇచ్చిన విలువ ఏపాటిదో చెప్పకనే చెపుతున్నాయంటున్నారు బిజెపి వర్గాలు . ఇప్పుడు ఈ అంశమై తెలంగాణా, ఏపిలలో చర్చ జరుగుతుండగా, అటు సామాజిక మీడియాలోనూ ఇదే జరుగుతోంది.