ప్రపంచకప్లో భారత క్రికెట్ టీం ఓటమిని నేటికీ అభిమానులు జీర్నించుకోలేకపోతున్నారు. రెండ్రోజుల పాటు దురదృష్టం వెంటాడటంతో ఇంటిముఖం పట్టిన భారత్ టీంకి కోచ్గా ఉన్న రవిశాస్త్రిని తప్పించి.. వేరొకరిని నియమిస్తున్నారంటూ సామాజిక మీడియాలో వార్తలకు ఊతమిచ్చేలా కోచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నాం అని బీసీసీఐ కూడా ప్రకటించడంతో కొత్తగా ఎవరు రానున్నారంటూ అనేక మందిపేర్లు వెలుగుచూసాయ్.
తాజాగాబీసీసీ అధికారి ఒకరు ప్రకటన చేస్తూ, . ఒక తప్పు మ్యాచ్తో ఆయన కోచింగ్ని విమర్శించడం తప్పు.శాస్త్రి కోచ్గానే కొనసాగుతారని అన్నారు. మరి కొత్త అర్జీల గురించి అడిగితే.... అవును అది వాస్తవమే. అయినా‘రవి శ్రాస్త్రి కోచ్గా టెస్టుల్లో జట్టు నెం.1 అయితే, వన్డేల్లో మన జట్టు రెండో స్థానంలో ఉంది. అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూస్తాం అటూ సమాధానం దాటవేసే యత్నం చేయటం విశేషం.