మేజర్న్యూస్, చంద్రగిరి : చంద్ర గిరిలోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి వారు వరదహస్తం దాల్చి హనుమంత వాహ నంపై భక్తులకు అభయమిచ్చారు. త్రేతా యుగంలో రామభక్తునిగా, భగవ ద్భక్తులలో అగ్రణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుంచి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి వెంకటయ్య, ఎఇఓ ధనంజ యులు, ఇతర అధికారులు, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.