హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే 191వ జయంతి ఉత్సవాలు మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, గౌరవ అతిథిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరవుతారు. పూలే జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, చైర్పర్సన్గ ణేశాచారి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. విశిష్ట అతిథులుగా డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, శాసన మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొంటారు.