ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో 7 వేలమందితో కూచిపూడి నృత్య ప్రదర్శన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 08:10 AM

విశాఖపట్నం: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 7 వేలమంది బాలికలచే కూచిపూడి నృత్యప్రదర్శన మంగళవారం విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు నృత్యప్రదర్శన చేసి గిన్నీస్‌బుక్‌ రికార్డుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమశాఖమంత్రి నక్కా ఆనంద్‌బాబులు హాజరవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com