విశాఖపట్నం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 7 వేలమంది బాలికలచే కూచిపూడి నృత్యప్రదర్శన మంగళవారం విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు నృత్యప్రదర్శన చేసి గిన్నీస్బుక్ రికార్డుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమశాఖమంత్రి నక్కా ఆనంద్బాబులు హాజరవుతారు.