ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత క్రికెట్ లో మరిచిపోని రోజు...

national |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2019, 06:33 PM

నేడు భారత క్రికెట్ లో మరిచిపోని రోజు...కపిల్ అండ్ కో తమ సత్తాచాటి ప్రపంచ కప్ ను తొలి సారి ముద్దాడిన రోజు ఇది. నేటికి సరిగ్గా 36 ఏళ్ల క్రితం టీమిండియా తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకున్నది ఈ రోజే...భారత క్రికెట్ జట్టు క్రికెట్ పుట్టింటికి ప్రపంచకప్ ఆడటానికి భారత్ బయలుదేరింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే భారత్ ఓడింది. ఆ అయినా పట్టువదలకుండా ఫైనల్ వరకు చేరింది భారత్. తీరా చూస్తే ఫైనల్ లో వెస్టిండిస్. భీకర ఫామ్ లో ఉన్న వెస్టిండిస్ టీం ముందు భారత్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అప్పటికే విస్టిండిస్ ప్లేయర్లందరూ గెలుస్తామన్న ధీమాతో షాంపెన్ బాటిల్స్ తెచ్చుకున్నారు. భారత్ జట్టులో మాత్రం కేవలం కపిల్ దేవ్ మాత్రమే షాంపెన్ బాటిల్ ను తెచ్చుకున్నాడు. గెలుస్తామన్న ధీమానా.. లేక మరేమైనానా తెలువదు కాని కపిల్ తనపై తన జట్టుపై ఉన్న నమ్మకాన్ని ధైర్యాన్ని ఇది సూచిస్తుంది.
లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ మొదలైంది……టాస్ గెలిచి వెస్టిండిస్ ఫీల్డింగ్ తీసుకుంది… ఆట షురూ అవగానే భారత్ కు దక్కా తాకింది. గవస్కర్ రెండు రన్స్ కే అవుటయ్యాడు. దీంతో శ్రీకాంత్, మోహిందర్ అమర్ నాథ్ పట్టువదలకుండా హాఫ్ సెంచరీ బాగస్వామ్యం నెలకొల్పారు. కలిప్ కూడా ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. దీంతో భారత్.. కేవలం 183 పరుగులు చేసి తక్కువ టార్గెట్ ను వెస్టిండిస్ ముందు ఉంచింది. వెస్టిండిస్ గెలుపు తప్పదని అనుకున్నారు క్రికెట్ పండితులు.
వెస్టిండిస్ బ్యాటింగ్ మొదలైంది.. కపిల్ టీం జాగ్రత్తగా బౌలింగ్ వేసింది. దీంతో ఒక్కో పరుగు చేయటానికి వెస్టిండిస్ చాలా కష్టపడింది. ఆ మ్యాచ్ లో కపిల్ ఒకే వికెట్ తీసినా పరుగులు ఎక్కువ ఇవ్వలేదు. మదన్ లాల్, మోహిందర్ అమర్ నాథ్ ముడు వికెట్లు తీసి ప్రత్యర్థులను కట్టడి చేశారు. దీంతో వెస్టిండిస్ కేవలం 140 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ తన తొలి ప్రపంచకప్ రుచి చూసింది.టోర్నీతో స్వదేశానికి తిరిగి వచ్చిన కపిల్ డెవిల్స్ కు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా వెల్ కమ్ చెప్పారు. ఆ తరువాత స్వదేశంలో ధోనీ నాయకత్వంలో రెండోసారి శ్రీలంకను ఫైనల్లో ఓడించి స్వంత అభిమానుల ముందు విశ్వవిజేతగా నిలిచింది. కపిల్ దేవ్ నాయకత్వంలో పడిన విత్తనం..గంగూలీ,ధోని నాయకత్వాల్లో చెట్టుగా మారి నేడు క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలేంత మహా వృక్షంగా ఎదిగింది. ఇప్పుడు కూడా విరాట్ కెప్టెన్సీలో భారత్ మరో సారి జగజ్జేతగా నిలవాలని ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com