పార్లమెంట్లో అరుదైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇద్దరు యువ మహిళా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీలుగా గెలిచిన నుస్రత్ జహన్, మిమి చక్రవర్తి మంగళవారం నాడు పార్లమెంట్లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరూ ప్రమాణ స్వీకార సమయంలో వందేమాతరం, జై హిందీ, జై బంగ్లా అని సంబోధించడం విశేషం. ప్రమాణ స్వీకార అనంతరం నుస్రత్, మిమి స్పీకర్ ఓం బిర్లా వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ ఇద్దరూ నటీమణులే కావడం గమనార్హం. నుస్రత్ జహన్ ఇటీవలే వ్యాపారవేత్త నిఖిల్ను పెళ్లి చేసుకున్నారు. టర్కీలో జూన్ 19న వీరి వివాహ వేడుక జరిగింది. మిమి చక్రవర్తి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లోని బసిర్హత్ నుంచి నుస్రత్, జాదవ్పూర్ నుంచి మిమి చక్రవర్తి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.