తమిళనాడు: చెన్నైలో తాగునీటి కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నీటి ఎద్దడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏ మాత్రం ట్యాంకర్లు సరిపోవడం లేదు. సమస్య తీవ్రంగా ఉండడంతో స్కూళ్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఐటి సంస్థల్లో తీవ్ర నీటి కొరత ఉండడంతో ఆ ఉద్యోగులను ఇంటి నుంచే వర్క్ చేయాల్సిందిగా సంస్థలు కోరుతున్నాయి. ట్యాంకర్లు కూడా సరిగా రావడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రాంనగర్లో నివసిస్తున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మున్సిపాలిటీ నీళ్లు రాంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తాయని, తమకు సరిగా రావని, పైపు లైన్లు సరిగా లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు వాపోతున్నారు.