ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఇవాళ పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో వారణాసి చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్నాయక్ ఘనస్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో రోడ్ షో నిర్వహించగా.. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వారణాసి వచ్చిన మోదీకి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. మోదీ వెంట బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, యూపీ సీఎం యోగి ఉన్నారు. పూజల అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు.