మలయాళ స్టార్ నటుడు సురేశ్ గోపీకి ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సురేశ్ గోపి ఈ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ చేతిలోc పాలయ్యారు. అంతేకాదు, ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. సీపీఐ అభ్యర్థి రాజాజి మాథ్యూ థామస్ రెండో స్థానంలో నిలిచారు. నిజానికి సురేశ్ గోపి గెలుపు నల్లేరుమీద నడకేనని భావించారు. తన స్టార్ ఇమేజ్ ఇందుకు ఉపయోగపడుతుందని భావించారు. దీనికి తోడు విద్యార్థి నాయకుడిగా సీపీఎం విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐ తరపున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం సురేశ్ గోపికి ఉంది. 2006 ఎన్నికల్లో సురేశ్ గోపి విచిత్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని తన సన్నిహితుల కోసం ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ తరపున బరిలోకి దిగారు. నిజానికి త్రిసూర్ నుంచి తుషార్ను బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. అయితే, చివరి నిమిషంలో మార్పులు చేసింది. తుషార్ను వయనాడ్కు మార్చి, సురేశ్ గోపిని త్రిసూర్ నుంచి బరిలోకి దింపింది.