ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సాన్ఫ్రాన్సిస్కో వెళ్లే ఎయిరిండియా విమానం(బోయింగ్ 777)లో మంటలు చెలరేగాయి. ఏసీ రిపేర్ చేస్తుండగా విమానంలోని ఎక్సిలరీ పవర్ యూనిట్(ఏపీయూ)లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.