ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మనం చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఈవీఎంలపై మన పోరాటం ఈనాటిది కాదన్నారు. అధికారం కోసం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారన్నారు. దుర్మార్గుల అరాచకాలన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు.