ఉత్తరప్రదేశ్లో బిజెపికి షాక్ తగిలింది. హమీర్పూర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అశోక్ చందేల్కు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.1997 జనవరి 26న ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో అశోక్తో పాటు మరో పదిమందికి జీవిత ఖైదును విధిస్తున్నట్లు జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ డికె.సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.తమ సోదరులైన రాజేష్ శుక్లా, రాకేష్ శుక్లాలతో పాటు మేనల్లుడు గణేష్లను, అలాగే వారి గన్మెన్లైన వేద్ ప్రకాష్ నాయక్, శ్రీకాంత్ పాండేలను హత్య చేసారని బాధితుల కుటుంబసభ్యులైన రాజీవ్ శుక్లా తెలిపారు.వారిని నిర్దోషులుగా పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినట్లు రాజీవ్ పేర్కొన్నారు.