తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, జరిగిన ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. అలాగే ఓర్వకల్లులో రాతివనాలను చంద్రబాబు సందర్శించారు.