ప్రపంచ కప్లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనేది తర్వాత నిర్ణయిస్తామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. శుక్రవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఈ స్థానంలో ఆడేందుకు విజయ్ తో పాటు కెఎల్.రాహుల్, దినేశ్ కార్తీక్, కేదర్ జాదవ్ లు పోటీలో ఉన్నారని తెలిపారు. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తే ఉపయోగంగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని విషయాలు చర్చించే విజరు శంకర్ ను సెలక్ట్ చేశామని కోహ్లీ వివరించారు.