ఒడిశా: ఒడిశా రాష్ట్రంలోని అనుగూరు జిల్లా సండపురం గ్రామంపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి చెందారు. ఆరుబయట నిద్రిస్తున్న ఐదుగురిని ఏనుగులు తొక్కి చంపాయి. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, పోలీసులు ఏనుగులను తరిమేందుకు యత్నిస్తున్నారు.